ఘోరం పెళ్లయిన 34 రోజులకే..
ఉద్యోగమొచ్చి ఏడాది కూడా కాలేదు, పెళ్లయి నెల దాటింది, అంత సంతోషంగా ఉన్నారు, అటువంటి సమయంలో ఆ కుటుంబాన్ని విధి వంచించింది. రోడ్డు ప్రమాదం రూపంలో నూతన పెళ్లి కొడుకును బలి తీసుకోగా, కాళ్ల పారాణి కూడా ఆరకముందే ఓ నవ వధువు పుట్టెడు దుఃఖంలో మునిగింది. వివరాలలోకి వెళితే లక్ష్మీనగర్తండాకు చెందిన వాల్యానాయక్, హేమ్లీబాయి దంపతులకు దేవీబాయి, తులసీరామ్ (29), గోపాల్, శ్రీనివాస్ సంతానం. డిగ్రీ పూర్తి చేసిన రెండో కుమారుడు తులసీరామ్ 2018లో సివిల్ కానిస్టేబుల్గా ఎంపికై రంగారెడ్డి జిల్లా మైలార్దేవరంపల్లి ఠాణాలో విధులు నిర్వహిస్తుండేవాడు. తులసీరామ్కు మే 8వ తేదీ, 2019లో పూడూరు మండలం బొంగుపల్లితండాకు చెందిన మౌనికతో వివాహమైంది. అయితే పీఎస్ పరిధిలో జరిగిన ఓ కేసు విషయమై నిందితుడిని పట్టుకోవడానికి బీహార్కు అధికారులు, సిబ్బందితో తులసీరామ్ వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తులసీరామ్ దుర్మరణం పాలయ్యాడు. దీంతో లక్ష్మీనగర్ తండాలో తీవ్ర విషాదం ఏర్పడింది.
ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుల్కు గత మే 8వ తేదీన వివాహమైంది. వివాహమైన 34 రోజులకే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో నవ వధువు దిగ్భ్రాంతికి గురైంది. ప్రమాదం వార్త తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.