ప్రియుడి సుఖం తీర్చేందుకు స్నేహితురాలికి మత్తు మందిచ్చిన లవర్..

Sunday, August 25, 2019 11:24 AM Crime
ప్రియుడి సుఖం తీర్చేందుకు స్నేహితురాలికి మత్తు మందిచ్చిన లవర్..

బాయ్ ఫ్రెండ్ కోరికమేరకు స్నేహితురాలినకి మత్తు మందు ఇచ్చి ఆమెపై ఘోరంగా అత్యాచారం జరిగేందుకు ఓ యువతి కారణమైంది. వివరాల్లోకి వెళితే జలంధర్‌లోని ఉంటున్న గుర్విందర్, సుమ్రిత్ కౌర్ ఇద్దరూ ప్రేమికులు. కొంత కాలంగా ఇద్దరూ ఘాడంగా ప్రేమించుకుంటున్నారు. సుమ్రిత్ కౌర్ స్నేహితురాలు మను (పేరు మార్చబడింది) పై గుర్విందర్ కన్ను పడింది. ఎలాగైనా ఆమెను లోబరుచుకోవాలని ప్లాన్ వేసాడు. సుమ్రిత్, గుర్విందర్ ఇద్దరూ ఒక రోజు మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తుండగా, గుర్విందర్ తన కోరికను తన ప్రేయసి ముందు బయటపెట్టాడు. మందు మత్తులో కూరుకుపోయిన సుమ్రిత్ తన స్నేహితురాలి శీలాన్ని గుర్విందర్‌కు తాకట్టు పెట్టేందుకు సిద్ధమైపోయింది. మను ని ఎలాగైనా తన ప్రియుడికి కు గిఫ్ట్ గా ఇవ్వాలని పన్నాగం పన్నింది. ఒక రోజు తన స్నేహితురాలికి ఇంట్లో పార్టీ ఉందని ఇంటికి రావాలని స్వయంగా ఆహ్వానించింది.

నిజమే అని నమ్మిన మను పార్టీకి బయలుదేరింది. సుమ్రిత్ ఇంటికి చేరుకున్న మను అక్కడి సీన్ చూసి షాక్ అయ్యింది. పార్టీ అని ఆహ్వానిస్తే అక్కడ తాను మాత్రమే ఉన్నానని మిగితా వారు ఏమయ్యారని అడిగింది. అయితే అనుమానం రాకుండా ఉండడానికి, సుమ్రిత్ పార్టీ కొంత సమయం లేట్ అయ్యే అవకాశం ఉందని, ముందుగా ఫ్రూట్ జ్యూస్ తాగుదామని ఆఫర్ చేసింది. మను డ్రింక్ తాగేందుకు ఓకే చెప్పింది. కుట్ర పన్నిన సుమ్రిత్ ఆ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చింది. అది తాగి మను మత్తులోకి జారుకోగానే, గుర్విందర్ మత్తులో ఉన్న మను పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మను మత్తు నుంచి తేరుకొని జరిగిన అఘాయిత్యం తెలిసి పోలీసులను ఆశ్రయించింది, తన స్నేహితురాలు చేసిన నమ్మక ద్రోహాన్ని పోలీసులకి వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ కొనసాగుతోంది.

For All Tech Queries Please Click Here..!
Topics: