వద్దు నాన్నా అని కాళ్లావేళ్ల పడ్డా వదల్లేదు... కన్నకూతురిపై కసాయి తండ్రి దారుణం!

Saturday, May 11, 2019 05:04 PM Crime
వద్దు నాన్నా అని కాళ్లావేళ్ల పడ్డా వదల్లేదు... కన్నకూతురిపై కసాయి తండ్రి దారుణం!

మద్యం మత్తులో ఒళ్లూ తెలియకుండా కన్న కూతురిపైనే అత్యాచారానికి యత్నించాడో తండ్రి. పెళ్లీడు వచ్చిన కూతురికి పెళ్లి చేయాల్సిన తండ్రి, ఆ బాధ్యత మరిచి... అత్యంత హీనంగా ప్రవర్తించాడు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌లో వెలుగుచూసింది. కాకినాడ రూరల్ మండలంలోని గైగోలపాడు గ్రామానికి చెందిన శ్రీనివాస్‌కు పెళ్లీడుకి వచ్చిన 22 ఏళ్ల కూతురు ఉంది. తల్లి కూతురికి పెళ్లి చేయడానకి ప్రయత్నాలు చేస్తుంటే... తండ్రి మాత్రం బాధ్యతలు మరిచి రోజూ తాగి వచ్చి గొడవలు చేస్తుండేవాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య చాలాసార్లు గొడవలు కూడా జరిగాయి. అయినా ఏ మాత్రం పద్ధతి మార్చుకోని శ్రీనివాస్... కూతురిపై కూడా చెయ్యిచేసుకునేవాడు. శుక్రవారం ఫుల్లుగా తాగి వచ్చిన శ్రీనివాస్... ఇంట్లో భార్య లేకపోవడంతో కూతురిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎక్కడికి వెళ్లిందంటూ ఆమెపై దాడికి దిగాడు. బంధువుల ఇంటికి వెళ్లిందని చెప్పినా వినకుండా పదే పదే అదే ప్రశ్న అడుగుతూ కూతురిని చితకబాదాడు. ఆ తర్వాత కన్నకూతురనే ఆలోచన కూడా మరిచిపోయి, ఆమెపై అత్యాచారానికి యత్నించాడు.

తండ్రి పాడు బుద్ధిని గ్రహించిన ఆమె... అతని నుంచి తప్పించుకుని బంధువుల ఇంటికి పారిపోయింది. వారి సాయంతో సర్పవరం చేరుకుని పోలీస్ స్టేషన్‌లో తండ్రి శ్రీనివాస్‌పై కేసు నమోదుచేసింది. కూతురు కేసు పెట్టిన విషయం తెలుసుకున్న శ్రీనివాస్ గ్రామం నుంచి పారిపోయాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

For All Tech Queries Please Click Here..!