కన్న కూతురిపై అత్యాచారం
చట్టాలు, శిక్షలు ఎంత కఠినమవుతున్నా మహిళలు మరియు బాలికలపై అత్యాచారాలు తగ్గడం లేదు. వావివరసలు మరిచిపోయి ఆడవారికై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. 13 సంవత్సరాల వయసున్న కన్న కూతురును కసాయి తండ్రే పలుమార్లు అనుభవించాడు. కన్నబిడ్డపైనే అత్యాచారానికి పాల్పడ్డ అతను తనకు కోర్టులో ఎలాంటి శిక్ష పడుతుందో అనే భయంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్లోని కార్వాన్, కుల్సుంపురా పోలీస్టేషన్ పరిధిలోని భాంజావాడికి చెందిన గణేష్(40) తన భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారిడితో కలిసి నివస్తున్నాడు. అయితే, 2017లో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో తన 13 సంవత్సరాల పెద్ద కుమార్తెపై అత్యాచారానికి పాల్పడడ్డాడు. బాలిక కథనం మేరకు తల్లి తన భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు నాంపల్లిలోని 16వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ నెల 13న విచారణకు వచ్చింది. విచారణ తర్వాత కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అన్న భయంతో గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గణేష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.