బర్త్‌ డే పార్టీకి పిలిచి, 23 మంది చిన్నారులను బందించి..!

Sunday, February 2, 2020 06:00 PM Crime
బర్త్‌ డే పార్టీకి పిలిచి, 23 మంది చిన్నారులను బందించి..!

బర్త్ డే పార్టీ అని పిలిచి 23 మంది చిన్నారులను బంధించాడో క్రిమినల్. అతడిని ఒక హత్య కేసులో ఇరికించారన్న కోపంతో గ్రామస్థులపై పగ తీర్చుకోవాలని అనుకోని ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఖర్తియా గ్రామంలో చోటుచేసుకుంది. సుభాష్ తన కూతురు పుట్టిన రోజు ఉందని గ్రామంలోని పిల్లలను ఆహ్వానించాడు. అలా వచ్చిన 23 మంది పిల్లలను బంధించి పగ తీర్చుకునేందుకు కుట్ర చేశాడు. పిల్లలతో పాటు వచ్చిన తల్లులను కూడా బంధించి. ఎవరైనా విడిపించుకునే ప్రయత్నం చేస్తే పిల్లల్ని చంపేస్తానని హెచ్చరించాడు.

దీంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ వార్త ఆ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి పిల్లల విడుదలకు ప్రణాళిక రచించారు. ఈ క్రమంలో రంగంలోకి దూకిన పోలీస్ బృందాలు అర్ధరాత్రి వరకు ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని ఎన్కౌంటర్ చేసి పిల్లలకు విముక్తి కల్పించారు. నిందితుడి ఇంట్లోంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

For All Tech Queries Please Click Here..!
Topics: