కాలువలో నీట మునిగిన కారు ... కారులో ఎంతమంది ఉన్నారో ఏక్కడివారో తెలియని పరిస్థితి..!
Friday, July 12, 2019 02:59 PM Crime
పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు మండలం విజ్జేస్వరం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం అతివేగం వలన అదుపుతప్పిన కారు గోదావరి నీళ్లు పొలాలకు మళించే కాలువ దిమ్మెను ఢీకొని కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో కారు నీటమునిగింది. కారులో ఎంత మంది ఉన్నారు, వారు ఏక్కడివారు అన్న నమాచరం తెలియని పరిస్థితి నెలకొంది. కాలువ గేట్లు మూసివేసి ప్రవాహాన్ని తగ్గించిన అనంతరం గాలింపు చెర్యలు చేపట్టారు.
For All Tech Queries Please Click Here..!