పురోహితుడితో నవ వధువు జంప్‌..

Wednesday, May 29, 2019 09:38 PM Crime
పురోహితుడితో నవ వధువు జంప్‌..

మధ్యప్రదేశ్లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. ఓ నవ వధువుతో కలిసి పురోహితుడు పారిపోయాడు. ఈ సంఘటన విధిష జిల్లాలోని సిరోంజ్ పట్టణంలో జరిగింది. పురోహితుడు నగులు, డబ్బుతో సహా ఆమెతో జంప్ అయ్యాడు. అయితే ఆ యువతి పురోహితుడితో లేచిపోయిందన్న విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆమె భర్త ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయం బయటకొచ్చింది. వివరాలలోకి వెళితే విధిష జిల్లాలోని సిరోంజ్‌ పట్టణానికి చెందిన ఓ యువతికి ఈ నెల 7న పెళ్లి జరిగింది. అయితే పెళ్లి వేడుక జరిగిపోయినా ఆ వధువు మాత్రం అత్తారింటికి వెళ్లలేదు. పుట్టింట్లోనే ఉంది. ఇక ఆ వధువు కూడా వ్యక్తిగత కారణాలు చెప్పడంతో అత్తింటివారు అభ్యంతరం చెప్పలేదు.

సీన్ కట్ చేస్తే ఈనెల 23న వధువు సడెన్ గా కనిపించకుండా పోయింది. దీంతో ఆ యువతి కోసం ఆమె తల్లిదండ్రులు అంతటా వెతికారు. అసలు ఏమైంది, తాను ఎక్కడకు వెళ్లిపోయి ఉంటుందని వాకబు చేస్తే అసలు విషయం తెలిసింది. ఏంటంటే ఆ యువతి ఆమెకు పెళ్లి చేసిన పురోహితుడు వినోద్ మహారాజ్‌తో కలిసి జంప్ అయ్యిందని. అంతేకాదు ఇంట్లో నుంచి ఆ యువతి పారిపోతున్న టైమ్‌లో రూ.లక్షన్నర విలువ చేసే బంగారం రూ.30 వేలు నగదు తనతో పాటు ఎత్తుకెళ్లిపోయింది. 

For All Tech Queries Please Click Here..!