బాత్రూంలో ఉరివేసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
Saturday, March 7, 2020 09:43 AM Crime
జిల్లాలోని తిమ్మాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్తిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వర్ధన్నపేట గ్రామానికి చెందిన 21ఏళ్ల అనూష తిమ్మాపూర్లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం ఉదయం అనూష కాలేజీకి రాకపోవడంతో సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేశారు.
For All Tech Queries Please Click Here..!