హైదరాబాద్‌లో ఘోరం... పూజ పేరుతో యువతిపై అత్యాచారం

Saturday, June 15, 2019 04:32 PM Crime
హైదరాబాద్‌లో ఘోరం... పూజ  పేరుతో యువతిపై అత్యాచారం

టెక్నాలజీలో దూసుకుపోతున్నా ప్రజల్లో మాత్రం మూఢ నమ్మకం ఇంకా పోవడం లేదు. ఈ కారణంగానే కొందరు మోసగాళ్లు మంత్రాలు పూజలు పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారు. మూఢ నమ్మకాలను ఆసరాగా తీసుకొని కొందరు అసాంఘిక కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇంట్లో దెయ్యం ఉందని, దాన్ని తన మంత్రాలతో తరిమేస్తానని నమ్మించిన ఓ భూత వైద్యుడు యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బోరబండకు చెందిన దంపతుల మూఢ నమ్మకాన్నీ ఆసరాగా చేసుకున్న మోసగాడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. 

వివరాలలోకి వెళితే తమ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండటం, పలు సమస్యలు వస్తుండటంతో కొన్ని వారాల క్రితం మల్లేపల్లికి చెందిన భూతవైద్యుడు ఆజంను కలిశారు ఆ దంపతులు. వారు చెప్పింది విన్న భూతవైద్యుడు ఇంట్లో దెయ్యం ఉందని, దాని వల్లే చెడు జరుగుతోందని వారిని నమ్మించాడు. దెయ్యంని ఇంట్లోంచి వెళ్లగొడితే అంతా మంచే జరుగుతుందని వివరించాడు. ఈ క్రమంలోనే దంపతుల కుమార్తెపై కన్నేసిన భూతవైద్యుడు, ఆమె పైన అత్యాచారం చేసాడు, తనను పెళ్లి చేసుకోకుంటే నీ తల్లిదండ్రులు చనిపోతారని ఆమెను బెదిరించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

For All Tech Queries Please Click Here..!