కోడల్ని పెళ్లాడేందుకు 40 ఏళ్ల కొడుకును ముక్కలుగా నరికిన తండ్రి
మానవతా విలువలు రోజు రోజుకు మరింతి దిగజారిపోతున్నాయి. ఇప్పటికీ ఎన్నో రకాల దారుణాలను చూశాం... కానీ ఇలాంటి ఘటన ఇది వరకెన్నడూ చోటు చేసుకోలేదు. కోడలితో సంబంధం పెట్టుకుని ఆమెను పెళ్లాడేందుకు కన్న కొడకును అతి కిరాతంగా చంపి ముక్కలుముక్కలుగా కోసిన ఘటన మంగళవారం అర్థరాత్రి పంజాబ్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... పంజాబ్లోని ఫరీద్కోట్ జిల్లాలో గల డబ్రి ఖానా గ్రామంలో నివసించే ఛోటా సింగ్ అనే 62 ఏళ్ల వ్యక్తి తన పెద్ద కుమారుడు రాజ్వింధర్ సింగ్(40)తో నివశిస్తున్నాడు. రాజ్వింధర్ సింగ్కు 12 ఏళ్ల క్రితం జశ్వీర్ కౌన్ అనే మహిళతో పెళ్లయింది. ఈ ఇద్దరు దంపతులకు ఇద్దరు పిల్లలు. సజావుగా సాగుతున్న వీరి కుటుంబాన్ని కన్న తండ్రే చిన్నాభిన్నం చేశాడు.
అంతకు ముందే పెద్ద కొడుకుతో పలు విషయాల్లో గొడవపడిన ఛోటా సింగ్ తన కోడలితో అక్రమ సంబంధాన్ని కొనసాగించేందుకు ఎలాగైనా కొడుకుని అంతమొందించాలని భావించాడు. తన తండ్రి విషయం తెలుసుకున్న కుమారుడు రెండు నెలల క్రితమే తన తమ కాపురాన్ని ఇంటికి దూరంగా మార్చాడు. కొన్నాళ్లకు అన్నీ సర్దుకున్నాయని భావించాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు అంతా ఒకే ఇంట్లో నిద్రిస్తున్నపుడు కొడుకు చేసిన పనిని జీర్ణించుకోలేకపోయిన తండ్రి కొడుకు రాజ్వింధర్ హత్యకు ప్రణాళిక రచించాడు. పదునైన ఆయుదంతో కొడుకుని చంపేసి ముక్కలు ముక్కలుగా నరికి ప్లాస్టిక్ బ్యాగుల్లో మూటగట్టి చెత్తకుప్పల్లో పడేశాడు. అయితే, నిద్రలో లేచిన ఛోటా సింగ్ మేనళ్లుడు ఇంట్లో రక్తపు మడుగును చూసి షాక్ అయ్యాడు. కొడుకునే చంపేశాడని భావించి మామను పోలీసులకు పట్టించాడు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.